తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయ ని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు .. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ సమ్మిట్ విజయవంతంగా పూర్తిచేశామని.. ఎలాంటి అవాంతరాలు లేకుండా సమ్మిట్ జరిగిందన్నారు.. మెస్సీ ప్రోగ్రామ్ కూడా విజయవంతంగా నిర్వహించామని.. 3 విడతల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు…మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా చిన్న గొడవ లేకుండా, నిష్పక్షపాతంగా జరిపించామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు…వరదల్లో డిజాస్టర్ రెస్పాన్స్తో పాటు పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని డీజీపీ శివధర్రెడ్డి కితాబునిచ్చారు…2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 5.6 శాతం పెరిగాయని, ఈ ఏడాది రాష్ట్రంలో శాంతి భధ్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని.. క్రైమ్ రేట్ 2.33 శాతం తగ్గినట్లు డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు…



