విషాద వార్త…సిపిఐ అగ్రనేత మృతి

విషాద వార్త…

సీపీఐ అగ్ర నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత..

కమ్యూనిస్టు పార్టీలో విషాదం నెలకొంది.. సీపీఐ పార్టి అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు…గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు… దింతో కమ్యూనిస్టులు , అహన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు…మహబూబ్‌నగర్‌ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న సుధాకర్ రెడ్డి జన్మించారు. 1998, 2004లో జరిగిన ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019వరకు ఆయన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు. సురవరం సుధాకర్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ఆయన పాల్గొన్నారు. సుధాకర్‌రెడ్డి కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బీఏ చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ పట్టాపొందారు. ఇక సుధాకర్ రెడ్డి 1974లో విజయలక్ష్మిని వివాహం చేసున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధాకర్ రెడ్డి మరణంతో కమ్యూనిస్టులు . ఆయన మరణానికి తీవ్ర సంతాపం తెలుపుతున్నారు…

విషాద వార్త...సిపిఐ అగ్రనేత మృతి- news10.app
సురవరం సుధాకర్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here