RK News10
175 POSTS
Exclusive articles:
జననం,కొప్పుల హరీశ్వర్ రెడ్డి 18 మార్చి 1947లో తెలంగాణ రాష్ట్రం , వికారాబాదు జిల్లా , పరిగి గ్రామంలో జన్మించాడు..
రాజకీయ జీవితం కొప్పుల హరీశ్వర్ రెడ్డి 1972 నుంచి 1977 వరకు పరిగి ఉప సర్పంచ్గా , 1977 నుంచి 1983 వరకు సర్పంచ్గా పని చేశాడు. ఆయన 1983లో స్వతంత్ర అభ్యర్థిగా...
విద్యార్థి డిబార్ ను రద్దు చేయండి…మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్
ప్రశ్నపత్రాల లీక్ లో ఐదు సంవత్సరాల పాటు డిబార్ చేసిన విద్యార్థి డిబార్ ను వెంటనే రద్దు చేయాలని మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖలో డిమాండ్ చేశారు…ప్రశ్నపత్రాల...
Breaking
త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య
త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలాలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఆయన తన సర్వీస్ గన్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.
లైంగికంగా లొంగకుంటే వేధింపులే…?
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లా లో ఆ ఉన్నతాధికారి బరితెగించాడట … తనకు లైంగికంగా లొంగడం లేదని ఓ మహిళా ఉద్యిగిణి ని నిత్యం వేదిస్తున్నాడట … వాట్సాప్ మెసేజ్ లతో బయపెడుతూ తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడట … సారు గారి గలీజు భాగోతం గూర్చి సదరు మహిళా ఉద్యోగి తన భర్తకు చెబితే నా గూర్చి నీ భర్తకు చెబుతావా…? అంటూ బెదిరింపులకు దిగుతున్నాడట …
డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!
మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాపు ఉద్యమ నేత ఇకలేరు…
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.


