హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖలో కేటాయించిన వారికే మళ్ళీ
మళ్ళీ ధాన్యం కేటాయిస్తూ అధికారులు కొందరు మిల్లర్ల పట్ల తమ పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…జిల్లాలో ఇప్పటికే కొందరు మిల్లర్లకు సింగిల్ టన్నేజ్ ధాన్యం కేటాయించగా వీరిలో కొందరు మిల్లర్లు డబుల్ టన్నేజ్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది…జిల్లాలోని ఓ 17 మంది మిల్లర్లు ఈ డబుల్ టన్నెజ్ కోసం ప్రయత్నం చేస్తుండగా వీరు ఇప్పటికే జిల్లా పౌర సరఫరాల అధికారిని ప్రసన్నం చేసుకున్నట్లు సమాచారం… ఇదే అదనుగా భావించిన ఆ అధికారి డబుల్ టన్నెజ్ కోసం ఒక్కో మిల్లర్ వద్ద నుంచి లక్షన్నర రూపాయలు వసూలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది…అంతేకాదు మీ మిల్లు కు డబుల్ టన్నెజ్ ధాన్యం కేటాయిస్తా డబ్బులు ఇవ్వండి అంటూ డి ఎస్ ఓ కొందరు మిల్లర్లకు ఫోన్ లు చేస్తూ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలియవచ్చింది…ఆ 17 మంది మిల్లర్లకు డబుల్ టన్నెజ్ ధాన్యం కేటాయించే ఫైల్ ను సిద్ధం చేసి అప్రూవల్ కోసం ఇంచార్జ్ అదనపు కలెక్టర్ దగ్గరకు డి ఎస్ ఓ పంపగా ఆ ఫైల్ పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది…ఐయితే ఈ 17 మంది మిల్లర్లు తమకు డబుల్ టన్నెజ్ ధాన్యం కేటాయించాలని పైరవీలు సైతం బాగానే చేస్తున్నట్లు తెలిసింది…వారికి డబుల్ టన్నెజ్ ధాన్యం కేటాయించాలని ఓ ఎంపీ పేషీ నుంచి ఓ అధికారికి ఫోన్ సైతం చేసినట్లు సమాచారం…కాగా జిల్లాలో ఇప్పటికి కొందరు మిల్లర్లకు అసలు ధాన్యమే కేటాయించకుండా కేటాయించిన వారికే డి సి ఎస్ ఓ ధాన్యం కేటాయించాలని చూడడం డబుల్ టన్నెజ్ ధాన్యం కేటాయిస్తా అని భరోసా ఇస్తూ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం పట్ల విమర్శలు వస్తున్నాయి….
డి ఎస్ ఓ కొత్త…దందా పాతదే
డి సి ఎస్ ఓ వసూళ్ల దందా పై న్యూస్10 విశ్వసనీయ కథనం….
ఈ రోజు సాయంత్రం న్యూస్10 సంచికలో



