చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని మంగళవారం మడికొండ చౌరస్తా లో నిర్వహిస్తున్న నిరాహార దీక్ష శిబిరం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది… డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించాలని మడికొండ కు చెందిన పండుగ రాజ్ కుమార్ ఒక్కసారిగా ఒంటిపై డీజిల్ పోసుకొని అంటించుకునే ప్రయత్నం చెయడంతో అక్కడ ఉన్నవారు అడ్డుకొని అతడి ఒంటిపై నీళ్లు పోసి నిలువరించారు… నిరాహార దీక్ష శిబిరం నుంచి తీసుకువెళ్లారు… గత 15 సంవత్సరాలుగా చెత్త డంపింగ్ యార్డ్ వల్ల తాము అష్టకష్టాలు పడుతున్న ఎవరికి పట్టడం లేదని ఎన్ని ఆందోళనలు నిర్వహించిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు…






