రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పై గవర్నర్ కు బి ఆర్ ఎస్ పిర్యాదు చేసింది… ఇప్పటికే పొంగులేటి అక్రమాలపై విచారణ జరపాలని అసెంబ్లీలో డిమాండ్ చేసిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే లు గవర్నర్ కు పిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది…మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలపై తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి నివేదిక ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది… కేటీఆర్, హరీష్ రావు మాజి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, తదితరులు గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు…



